News March 24, 2025

కొండాపూర్: ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరు

image

పదో తరగతి ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 22,406 మందికి 22,362 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా పరిశీలకురాలు ఉషారాణి ఐదు, డీఈవో వెంకటేశ్వర్లు మూడు, అసిస్టెంట్ కమిషనర్ పండరీ నాయక్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

image

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు. 

News March 27, 2025

LPG ట్యాంకర్ల సమ్మె.. AP, TGలపై ప్రభావం

image

చమురు కంపెనీలు తెచ్చిన కొత్త కాంట్రాక్ట్ నిబంధనలతో నేటి నుంచి LPG ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీనివల్ల ట్యాంకర్లలో అదనపు డ్రైవర్/క్లీనర్ లేకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారు. దీంతో ఇవాళ్టి నుంచి 4వేల ట్యాంకర్లు నిరవధిక సమ్మెలో పాల్గొంటాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలలో గృహ, వాణిజ్య LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

News March 27, 2025

కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

image

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!