News April 5, 2025

కొటికలపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

అద్దంకి మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువులు మేపుకోవడం కోసం వెళ్లిన కోటేశ్వరమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 21, 2026

సిద్దిపేట: ‘అర్రైవ్ అలైవ్’తో ట్రాఫిక్ చైతన్యం

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అర్రైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు రూపొందించి@Siddipet_Police_Commissionerate ను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ్ తెలిపారు.

News February 21, 2026

GNT: విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య గమనిక

image

గుంటూరు జిల్లాలో 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న శారీరక విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 25న జరగనుంది. బృందావన్ గార్డెన్స్ 1వ లైనులో ఉదయం 10గంటల నుంచి ఎంపిక కమిటీ ద్వారా ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు N వెంకరమణప్ప తెలిపారు. దరఖాస్తు చేసుకొని ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.

News February 21, 2026

సంగారెడ్డి: 23 నుంచి యథావిధిగా ప్రజావాణి

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.