News January 26, 2025
కొడంగల్లో 4 పథకాలు ప్రారంభించనున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు పథకాలను ప్రారంభించనున్నారు. HYD మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News December 31, 2025
అమరావతి జిల్లా లేనట్లేనా.?

అమరావతి జిల్లాగా మారుతుందని ఎంతగానో ఎదురుచూసిన వారి ఆశలు అడియాసలుగా మారాయి. APలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు, సోమవారం క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా డిసెంబర్ 31 నుంచి 2 కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది తర్వాత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుగా భావించినప్పటికీ.. ముందే ఏర్పాటును అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అమరావతి జిల్లా కలగానే మిగిలిందంటున్నారు.
News December 31, 2025
2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్లు 25

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.
News December 31, 2025
REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.


