News January 26, 2025

కొడంగల్‌లో 4 పథకాలు ప్రారంభించనున్న సీఎం

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు పథకాలను ప్రారంభించనున్నారు. HYD మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News

News November 6, 2025

KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

image

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

News November 6, 2025

SRD: ‘సైబర్ మోసాలకు గురైతే ఇలా చేయండి’

image

విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి మండలం పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లలో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.

News November 6, 2025

బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.