News August 12, 2025

కొడంగల్ అభివృద్ధిపై HYDలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

image

కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో CM రేవంత్ రెడ్డి ఈరోజు HYDలో సమీక్షించారు. కొడంగల్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి గుడిని సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో కొడంగల్‌లోని చారిత్రక శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలన్నారు.

Similar News

News August 13, 2025

HYDకు జల ప్రళయం తప్పదా?

image

చినుకు పడితే వణికే HYD ఈ 3 రోజులు జల ప్రళయం ఎదుర్కోక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల 7 సెం.మీ నుంచి 10 సెం.మీ వాన కురిస్తే ముంపు ఏరియాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక నార్త్ HYDలో 20సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మొన్న నమోదైన 15.15 సెం.మీ వర్షపాతంతో కుత్బుల్లాపూర్‌ అతలాకుతలమైంది. ఇప్పుడేమో <<17390735>>20 సెం.మీ<<>> అంటుంటే నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

News August 13, 2025

HYD: SPTUలో డిప్లమా ఇన్ మ్యాజిక్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహింపబడుతుందన్నారు. ఆసక్తి గలవారు 9059794553కు సంప్రదించాలన్నారు.

News August 13, 2025

పాతబస్తీకి మెట్రో.. రూ.360 కోట్ల పరిహారం: NVS రెడ్డి

image

పాతబస్తీ మెట్రో ఆస్తుల సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 412 నిర్మాణాలకు పరిహారం ప్రకటించినట్లు MD NVS రెడ్డి తెలిపారు. 380 ఇళ్లను కూల్చివేయగా రూ.360 కోట్ల పరిహారం చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో కారిడార్ పిల్లర్లకు తగిన స్థలాల ఎంపిక చేసి మార్కింగ్ పనులు పూర్తి చేసి భూ సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.