News April 3, 2025
కొడంగల్: పిడుగుపాటుతో గొర్రెలు, మేకలు మృతి

కొడంగల్ మండలం ఖాజా అహ్మద్పల్లి గ్రామంలో పిడుగు పాటుతో గొర్రెలు, మేకలు మృతి చెందాయి. పకీరప్ప రోజు మాదిరిగా జీవాలను మేతకు వెళ్లారు. అకాల వర్షం నేపథ్యంలో దాదాపు 30 మేకలు, గొర్రెలు చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడింది. దీంతో 25 జీవాలు మృతిచెందగా దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన పకీరప్ప కోరుతున్నారు.
Similar News
News April 8, 2025
కేంద్ర మంత్రికి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించిన కమిషనర్

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పురోగతిపై ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టి కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్కి వివరించారు.
News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
News April 8, 2025
మదనపల్లె: కానిస్టేబుల్ జయప్రకాష్ దుర్మరణం

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ జయప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం తన కొడుకుకి ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం బెంగుళూరు వెళ్లాడు. సిటీలో హాస్పిటల్కు వెళ్తుండగా బుల్లెట్ బైక్ ఢీకొని తలకు బలమైన గాయలయ్యాయి. అక్కడ చికిత్స చేయించి, తిరుపతి నారాయణద్రి హాస్పిటల్కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు.