News February 12, 2025
కొడంగల్: బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290147339_51934976-normal-WIFI.webp)
దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 21న ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జయరాములు, నాయకులు మెరుగు వెంకటయ్య, సీసీ వెంకటయ్యగౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737374916723_893-normal-WIFI.webp)
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. భక్తులు వారికి నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించింది. కొంతమంది భక్తులు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో TTDపై వారంతా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
News February 12, 2025
HYD: స్టూడెంట్ మృతి.. శ్రీ చైతన్య ప్రిన్సిపల్పై కేసు (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373347956_705-normal-WIFI.webp)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ కేసులో పాఠశాల ప్రిన్సిపల్ పై కేసు నమోదయింది. ఇదే విషయంపై Way2News ప్రతినిధి మేడ్చల్ ACP బి.శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లైన్లో మాట్లాడారు. విద్యార్థిని తల్లి కమల ఫిర్యాదు మేరకు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
News February 12, 2025
HYD: స్టూడెంట్ మృతి.. శ్రీ చైతన్య ప్రిన్సిపల్పై కేసు (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373227648_705-normal-WIFI.webp)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ కేసులో పాఠశాల ప్రిన్సిపల్ పై కేసు నమోదయింది. ఇదే విషయంపై Way2News ప్రతినిధి మేడ్చల్ ACP బి.శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లైన్ లో మాట్లాడారు. విద్యార్థిని తల్లి కమల ఫిర్యాదు మేరకు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.