News March 20, 2024
కొడంగల్: వ్యవసాయ శాఖ అధికారిపై వేటు

నకిలీ ధ్రువపత్రాల అభియోగంతో కొడంగల్ వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనలో 10వ తరగతి సర్టిఫికెట్ నకిలీదని రుజువు అయినట్లు సమాచారం. ఈ విషయంపై కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ను వివరణ కోరగా బాలాజీ ప్రసాద్ సస్పెండైన విషయం వాస్తవమే అన్నారు.
Similar News
News September 3, 2025
ఉమ్మడి మహబూబ్నగర్లో వర్షాలు

గడిచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు ఉదయం 7 గంటల సమయానికి అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 43.5 ఎంఎం వర్షపాతం, గండీడ్ మండలంలో 35.0 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అడ్డాకుల మండలంలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల మండలంలో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా సగటున 10.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.
News September 3, 2025
MBNR:ఓటర్ లిస్ట్.. మొత్తం 4,99,582

1.గండీడ్-32,246, 2. మహమ్మదాబాద్ – 31,291, 3. రాజాపూర్ -21,772, 4. నవాబుపేట -40,193, 5. మిడ్జిల్ -25,128, 6. మూసాపేట-21,549, 7. మహబూబ్ నగర్ రూరల్-34,806, 8. కౌకుంట్ల -16,987, 9. కోయిలకొండ -52,175, 10. జడ్చర్ల – 40,861, 11.హన్వాడ -40,392, 12.దేవరకద్ర -26,239, 13. సీసీ కుంట -31,056, 14. భూత్పూర్ -27,080, 15. బాలానగర్ -33,437, 16. అడ్డాకల్ -24,370 మంది ఓటర్లు ఉన్నారు.
News September 2, 2025
పాలమూరు: AHTU.. 22 కార్యక్రమాలు

మహబూబ్నగర్ జిల్లా పోలీసు ‘ప్రజా భద్రత పోలీసు బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) గత నెల(ఆగస్టు) జిల్లా మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే తక్షణమే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.