News February 20, 2025
కొడంగల్: సీఎం రేవంత్ పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం హోదాలో మొదటి సారిగా పోలేపల్లి ఎల్లమ్మ దర్శనం కోసం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న సీఎం రానుండటంతో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పోలేపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 5, 2025
250 కేజీల బియ్యంతో అన్నాభిషేకం

కపిలతీర్థంలో జరిగే అన్నాభిషేకానికి 250 కిలోల బియ్యాన్ని వండుతారు. భూమితలం నుంచి పానవట్టం వరకు లింగాన్ని అన్నంతో కప్పుతారు. ఆ తరువాత ఒక చిన్న శివలింగాన్ని, నందిని తీర్చిదిద్దుతారు. లింగంపై వివిధ రకాల కూరగాయలను ఉప్పు లేకుండా ఉడికించి సర్పాభరణాలుగా, చంద్రవంకగా, డమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. అంతేకాకుండా పోలీసులు, సుఖియలు, మురుకులు, ఫేణీలు, వడలతో అలంకరిస్తారు.
News November 5, 2025
పశువులకు రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది?

పశువుల్లో ఈ వ్యాధి ‘రేబీస్’ వైరస్వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన కుక్కలు, పిల్లులు, నక్కలు.. పశువులు, గొర్రెలు, మేకలను కరిచినప్పుడు రేబీస్ సోకుతుంది. అలాగే రేబీస్ సోకిన జంతువుల లాలాజలం, కంటి స్రావాలు.. పాడి పశువుల శరీరంపై ఉన్న గాయాలపై పడినప్పుడు కూడా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పశువుల పాలను సరిగా మరిగించకుండా తాగినా, మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి మనుషులకూ సోకే అవకాశం ఉంది.
News November 5, 2025
కపిలతీర్థ ముక్కోటి అంటే తెలుసా.?

కార్తీక మాసం పౌర్ణమి రోజున కపిలతీర్థంలో అన్నాభిషేక వార్షిక సేవను నిర్వహిస్తారు. దీనినే కపిలతీర్థ ముక్కోటి అని అంటారు. ఆ రోజున మధ్యాహ్న సమయంలో మహాలింగానికి ఏకాంతంగా అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.


