News February 25, 2025
కొడంగల్: సీఎం రేవంత్ సెంటిమెంట్ ఆలయం ఇదే.!

కొడంగల్ పట్టణంలోని శ్రీ గాడిబావి శివాలయం అంటే సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంటుగా భావిస్తారు. 300 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగం అతిపెద్ద పాణివాటం, బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
Similar News
News February 25, 2025
మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్గా నిలుస్తారేమో చూడాలి.
News February 25, 2025
ఈ అన్హెల్తీ ఫుడ్స్కు దూరంగా ఉండండి: వైద్యులు

షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్హెల్తీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లు, ఐస్క్రీమ్స్తో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ తినొద్దు’ అని చెప్పారు.
News February 25, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్పేట్కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.