News October 21, 2025
కొడంగల్: ‘THANK YOU’ సీఎం సార్

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ సొసైటీ ఉదయం అల్పాహారం అందిస్తుంది. ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, పూరి, మైసూర్ బోండా, ఉప్మాతో పాటు మంగళవారం నుంచి కొత్తగా సెట్ దోసెను ప్రవేశపెట్టారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల హాజరుశాతం మెరుగైందని MEO రామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ‘ THANK YOU ‘సీఎం సార్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News October 21, 2025
ఎమ్మార్వో, ఆర్ఐ అక్రమాలపై విచారణ- అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని MLA అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి తాహశీల్దార్, ఆర్ఐ అక్రమాలపై ఫిర్యాదులను నేరుగా లేదా వాట్సాప్ నంబర్ 9392017899కు పంపించాలన్నారు. ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు జారీ చేశామన్నారు. రూ.3.84 కోట్ల రికవరికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.
News October 21, 2025
మహిళలు రోజుకొక ఆరెంజ్ తింటే..

ఆరెంజ్లలో ఉండే విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. రోజుకొక ఆరెంజ్ తింటే ఒత్తిడి 20% తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ వంటి పోషకాలను అందిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది.