News January 27, 2025
కొడిమ్యాల: ఆచూకీ దొరకని పులి జాడ

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఈ నెల 23న ఆవుపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పులి సంచారంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించి, పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఇంకా సీసీ కెమెరాలో పులి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆ గుట్టకు అనుకొని మల్యాల మండలంలోని ఓబులాపూర్, గొర్రెగుండం గ్రామాల గుట్టలు ఉన్నాయి.
Similar News
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
ఇథనాల్ మిక్స్.. మీ వాహనం సేఫేనా – 1/2

ఏప్రిల్ 1 నుంచి E20+RON 95 కాంబినేషన్లో ఫ్యూయెల్ అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ అనేది పెట్రోల్ నాణ్యతను సూచిస్తుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న RON 91ను RON 95 రీప్లేస్ చేయనుంది. ఈ RON ఎంత ఎక్కువ ఉంటే వాహనానికి అంత మంచిది. ఇథనాల్ ప్రభావం వాహనంపై పడకూడదని RON 95ను కేంద్రం తీసుకొచ్చింది. 2023కి ముందు తయారైన వాహనాలకు మాత్రం ఈ నిర్ణయం సవాళ్లను తెచ్చే ఛాన్స్ ఉంది.
News February 27, 2026
ఇథనాల్ మిక్స్.. మీ వాహనం సేఫేనా – 2/2

వాహనం 2023 కన్నా ముందుదైతే E20కి తగినదో కాదో చెక్ చేయడం మంచిది. E20కి పనికిరాదంటే తరచూ సర్వీస్ చేయిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంక్లో E20 పెట్రోల్ నిలువ ఉంచి వాహనం ఎక్కువ కాలం వాడకపోతే ఇంజిన్, ఫ్యూయెల్ సిస్టమ్ పాడైపోతాయి. E20తో వాహనాల మైలేజ్ తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు, కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా, వీటితో పాత వాహనదారులకు మెయింటెనెన్స్ భారంగా మారే అవకాశం ఉంది.


