News January 27, 2025

కొడిమ్యాల: ఆచూకీ దొరకని పులి జాడ

image

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఈ నెల 23న ఆవుపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పులి సంచారంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించి, పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఇంకా సీసీ కెమెరాలో పులి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆ గుట్టకు అనుకొని మల్యాల మండలంలోని ఓబులాపూర్, గొర్రెగుండం గ్రామాల గుట్టలు ఉన్నాయి.

Similar News

News December 30, 2025

శ్రీకాళహస్తి : ఈదురు కాలువలో మహిళ డెడ్ బాడీ

image

శ్రీకాళహస్తి (M) ఊరందూరు చెరువు దగ్గర ఉన్న ST కాలనీ వద్దనున్న ఈదుర కాలువలో మంగళవారం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమయింది. పొలం పనులు చేస్తున్న రైతులకు సుమారు 50 నుంచి 60 సం.ల మధ్య వయసుగల మహిళా మృతదేహాన్ని కాలువలో గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఏరియా హాస్పిటల్‌కి మృతదేహాన్ని తరలించారు. ఆమె చేతిపై హిందీలో అక్షరాలు ఉన్నాయని గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.

News December 30, 2025

గద్వాల: ఆహార విక్రయశాలలపై నిఘా ఉంచాలి: కలెక్టర్

image

గద్వాల జిల్లాలోని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన ఆహార భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యమని పేర్కొన్నారు. జిల్లాలో 1,278 విక్రయశాలలు నమోదయ్యాయని, మిగిలిన వాటిని కూడా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులకు సూచించారు.

News December 30, 2025

గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

image

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.