News October 25, 2025

కొడిమ్యాల: ‘ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి’

image

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కొడిమ్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. సండ్రళ్లపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని లత సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Similar News

News October 25, 2025

ఆ యాప్‌లను అధిగమించలేము: పర్‌ప్లెక్సిటీ సీఈవో

image

యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను అధిగమించడం అసాధ్యమని ఏఐ సెర్చింజన్ పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్‌‌లను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎకో సిస్టమ్‌ను ఏ స్టార్టప్ దాటలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయన‌పై విధంగా బదులిచ్చారు. గూగుల్ సృష్టించిన జెమినీని అధిగమించడం కష్టమేనని పలువురు పేర్కొన్నారు. అరవింద్ కామెంట్స్‌పై మీరేమంటారు?

News October 25, 2025

అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరి ప్రసాద్ జననం
1968: సినీ నటుడు సంపత్ రాజ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం(ఫొటోలో)
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
* అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

News October 25, 2025

కెప్టెన్‌ను బోర్డు కన్సల్టెంట్‌గా నియమించిన పాక్

image

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్‌కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.