News March 16, 2025

కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

image

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.

Similar News

News March 1, 2026

త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.

News March 1, 2026

రామన్నపేట: డిగ్రీ పూర్తి చేయలేకపోయారా.. ఇది మీకోసమే

image

డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి MGU సువర్ణావకాశం కల్పించింది. రామన్నపేట డిగ్రీ కాలేజీలో 2010–11 నుంచి నేటి వరకు పాత(ఇయర్/సెమిస్టర్), నూతన విధానం(సెమిస్టర్)లో డిగ్రీ సకాలంలో పూర్తి చేయలేకపోయిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.డా.రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.J.చిన్నబాబు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి MAR 4 చివరి తేదీ అని, బ్యాక్‌లాగ్ ఉన్నవారు ముందుకు రావాలని కోరారు.