News March 16, 2025
కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.
Similar News
News March 16, 2025
CM రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి: KTR

TG: OUలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని KTR అన్నారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో CM సమాధానం చెప్పాలన్నారు. ‘ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న CM, 6 గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు’ అని ట్వీట్ చేశారు.
News March 16, 2025
మండపేట: మాజీ మున్సిపల్ ఛైర్మన్ తల్లి మృతి

మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాతృమూర్తి చుండ్రు అనంతలక్ష్మి (70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజులు క్రితం గుండె సంబంధిత సమస్యలు తలెత్తగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News March 16, 2025
టీమ్ను మార్చినా ఓటమి తప్పలేదు

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజమ్తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్ను ఛేదించింది. NZ గడ్డపై పాక్కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.