News February 13, 2026

కొత్తగూడెంలో కొత్త కార్పొరేటర్ ‘కిడ్నాప్‌’ కలకలం..!

image

కొత్తగూడెం మేయర్‌ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 32వ డివిజన్‌ నుంచి BRS తరఫున గెలిచిన కార్పొరేటర్‌ గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Similar News

News February 21, 2026

జగిత్యాల: ఉపాధ్యాయుల సర్వీసు వివరాల పరిశీలన

image

జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26 నుంచి 28 వరకు, అలాగే మార్చి 2న సర్వీసు వివరాల పరిశీలన నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జగిత్యాల (అర్బన్) ఎంఆర్సీలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, ధ్రువపత్రాలు, నిర్ణీత ప్రొఫార్మాలతో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

News February 21, 2026

మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

image

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: ప్రశ్నాపత్రాల తరలింపు

image

జనగామ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్‌లకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నాపత్రాలను అందజేశారు. పోలీసు బందోబస్తు నడుమ వీటిని నిర్దేశించిన కేంద్రాలకు తరలించారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.