News October 3, 2024
కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం లక్ష్మిపురానికి చెందిన ప్రవీణ్, ప్రణయ్ కలిసి బుధవారం బైక్పై అనంతొగుకి వెళ్లారు. మర్కోడు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.
Similar News
News October 3, 2024
గ్రామాల్లో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పూల పండుగ(బతుకమ్మ) సంబురాలు రానే వచ్చాయి. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి రోజుకో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాలు దుమ్ముగూడెం మండలంలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అట్టహాసంగా ముగుస్తాయి.
News October 3, 2024
ఖమ్మం: గాలి వాన బీభత్సం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలం బైరంపల్లిలో పెద్ద గాలికి చెట్టు విరిగి గేదెపై పడింది. అనాసాగరం- పమ్మి శివారులో భారీ వృక్షం పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
News October 3, 2024
నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి(2025-26) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7వ తేదీ అన్నారు. 01-05-2013 నుండి 31-07-2015 జన్మించి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 18-01-2025 న ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.