News January 23, 2025
కొత్తగూడెం ఎయిర్పోర్టుతో మరింత అభివృద్ధి: ఎంపీ

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం పుణ్యక్షేత్రం సందర్శన కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల సులభం అవుతుందని ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి తెలిపారు. సింగరేణి హెడ్ ఆఫీస్, KTPS, స్పాంజ్ ఐరన్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పేపర్ బోర్డు ఇలా ప్రఖ్యాత పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయని వివరించారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కదలిక తీసుకురావడం జరిగిందన్నారు.
Similar News
News February 14, 2026
సింగరేణిలో డంప్మెన్ పోస్టులకు పరీక్ష

సింగరేణి రామగుండం-2 ఏరియాలో డంప్మెన్ (ట్రిప్మెన్) ఖాళీల భర్తీకి సెకార్-3 సింగరేణి స్కూల్లో అంతర్గత పరీక్ష నిర్వహించారు. 23 మందికి గానూ 21 మంది హాజరయ్యారు. ఎస్.ఓ టు జీఎం సంతోష్ కుమార్ ప్రశ్నపత్రాల సీలును తెరిచారు. ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, డీవైపీఎం వంశీధర్, ప్రిన్సిపల్ సుందర్ రాజు పాల్గొన్నారు. ఏఎస్ఓ షరీఫ్ మహ్మద్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
News February 14, 2026
ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులో శుక్రవారం రాత్రి సుబ్బు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బు బేల్దారి పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. సుబ్బు, వినయ్ మద్యం తాగి గొడవ పడినట్లు, ఈ గొడవ హత్య వరకు వెళ్లిన్నట్లు సమాచారం. 3వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2026
విశాఖ చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.


