News July 20, 2024
కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News December 18, 2025
ఖమ్మం కలెక్టర్కు ‘బిట్స్ పిలానీ’ ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ ప్రకటించిన ‘యంగ్ అల్యూమ్నీ అచీవర్స్ అవార్డ్స్-2026’కు ఆయన ఎంపికయ్యారు. 2007బ్యాచ్కు చెందిన అనుదీప్, సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో పాటు, IASగా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో కలెక్టర్కు జిల్లా ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 18, 2025
KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 18, 2025
ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.


