News July 20, 2024

కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News August 21, 2025

ఖమ్మం: 30 రోజుల కస్టడీ బిల్లు.. ప్రతిపక్షాలపై కుట్ర: సీపీఐ

image

ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన దొంగల కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 130 రోజుల కస్టడీ బిల్లు అని తమ్మినేని పేర్కొన్నారు.

News August 21, 2025

ఖమ్మం: కేంద్ర ఆర్థిక మంత్రికి కలిసిన: డిప్యూటీ సీఎం

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు, ఆర్థిక సహాయంపై డిప్యూటీ సీఎం వివరించారు.

News August 21, 2025

నీటిపారుదల సంరక్షణ చర్యలు చేపట్టాలి: ఖమ్మం ఎంపీ

image

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. నీటిపారుదల, సంరక్షణ చర్యలు చేపట్టాలని, స్థిరమైన గ్రామీణాభివృద్ధికి సహకారం అందించాలన్నారు.