News April 11, 2025

కొత్తగూడెం: గ్రేట్.. 88 లక్షల మొక్కలు పంపిణీ 

image

గత 38 ఏళ్లుగా ప్రకృతితో స్నేహం చేస్తూ దాదాపుగా 88 లక్షల మొక్కలను మొక్కల వెంకటయ్య పంపిణీ చేశారు. ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు బొకే బదులుగా మొక్కలు ఇచ్చే సంస్కృతిని తీసుకొచ్చారు. శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ వారికి 45 ఔషధ గుణాలున్న మొక్కలను ఉచితంగా అందజేశారు. ప్రకృతిని కాపాడుతున్న కొత్తగూడెం టౌన్ రామవరం ప్రాంతానికి చెందిన మొక్కల వెంకటయ్య మనందరికీ ఆదర్శమే..!

Similar News

News April 18, 2025

గుడివాడలో విజయవాడ యువకుడి వీరంగం

image

గుడివాడలో విజయవాడ యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన సమాచార ప్రకారం విజయవాడలో మాచవరానికి చెందిన సాయి గుడివాడ వెళ్లి దుర్గాప్రసాద్‌పై శుక్రవారం బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన దుర్గాప్రసాద్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా సాయిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

News April 18, 2025

ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

image

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

News April 18, 2025

ఖమ్మం: ఫైనాన్స్ వేధింపులు.. యువకుడి SUICIDE

image

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!