News January 21, 2026
కొత్తగూడెం: తొలి రోజే పులి పాదముద్రలు లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్-2026’ సర్వే ప్రారంభమైంది. పాల్వంచ రేంజ్ పరిధిలో స్వయంగా DFO కిష్టాగౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో తొలిరోజే పులి పాదముద్రలు కనిపించాయి. ప్రతిరోజూ 5 కి.మీ మేర అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు, అడుగు జాడలను పరిశీలించి ‘M-STriPES’ యాప్లో వివరాలను నమోదు చేస్తున్నారు. నాలుగేళ్లకు ఒకసారి ఈ వన్యప్రాణుల గణన జరుగుతుంది.
Similar News
News February 19, 2026
VJA: బ్యాంకు ఒప్పంద ఉద్యోగుల చేతివాటం.. స్కాముల్లోను వారే!

విజయవాడలోని బ్యాంక్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్రమాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల గవర్నర్పేటలోని ఓ బ్యాంక్ లాకర్లో రూ.50 లక్షల బంగారం మాయం కాగా, సిబ్బంది గుట్టుగా రికవరీ చేశారు. మరోవైపు సైబర్ నేరాలకు వాడే ‘మ్యూల్ ఖాతాల’ వెనుక వీరి పాత్ర ఉండటంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏ4 నిందితుడిగా దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేయగా, పలువురు మేనేజర్లను పోలీసులు విచారిస్తున్నారు.
News February 19, 2026
NTR: ఎం.ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఎం.ఫార్మసీ విద్యార్థులు Y25 బ్యాచ్(రెగ్యులర్) & Y22, Y23, Y24 బ్యాచ్లు(సప్లిమెంటరీ) రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 30 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 16లోపు, రూ.100 ఫైన్తో 17లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News February 19, 2026
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. గత 2నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 1,176మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 222 మందికి జైలు శిక్ష పడింది. ఒకరికి నెల రోజులు, ఐదుగురికి 15రోజుల జైలు శిక్ష ఖరారైంది. రూ.14.87లక్షల జరిమానా వసూలు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


