News March 27, 2024

కొత్తగూడెం: బైక్ చోరీ.. చలనాతో బయటపడింది..

image

ములుగు జిల్లాలో ఇటీవల చోరీకి గురైన బైక్ మణుగూరులో ప్రత్యక్షమైంది. కాగా స్థానిక పోలీసులు ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించలేదని చలానా కొట్టడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 8, 2024

నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి

image

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌‌గా పోలీసులు గుర్తించారు. 

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.