News March 5, 2025
కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద మంగళవారం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 5, 2025
వికారాబాద్ జిల్లాలో బుధవారం ముఖ్యాంశాలు

✓ కొడంగల్, దుద్యాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజనుల పాలాభిషేకం.✓ VKB జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.✓ కొడంగల్: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల బిల్లులు కలెక్టర్కు మాజీ కలెక్టర్కు పాఠశాలలో AI తరగతులను పరిశీలించిన బెంగుళూరు బృందం.✓VKB:విద్యార్థినిని పరామర్శించిన స్పీకర్
News March 5, 2025
విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
News March 5, 2025
విద్యార్థులు ఇలా చేస్తే పరీక్షలు ఈజీగా రాయొచ్చు!

☛ ఎగ్జామ్ టైమ్లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి, ముందుగా తెల్సినవి రాయాలి. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు.
☛ పరీక్షలకు ముందు చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
☛ క్లాస్లు జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫాస్ట్గా రాయడం అలవాటౌతుంది.
☛ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీ ఫైనల్స్ రాయాలి. దీని వల్ల టైమ్ మేనేజ్మెంట్ అలవడుతుంది.