News March 1, 2025
కొత్తగూడెం: ‘వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ’

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో వారికి పూలతో ఘన నివాళులు అర్పించారు. అమరులైన వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, చరణ్, చందు, సాయికుమార్, కిషోర్, అనిల్, భరత్, రాకేశ్ పాల్గొన్నారు.
Similar News
News December 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 28, 2025
దుర్గగుడిలో పవర్ కట్.. ఏం జరిగిందంటే?

AP: నిన్న విజయవాడ దుర్గగుడిలో 3 గంటల పాటు పవర్ కట్ చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లకు కలిపి రూ.4.5 కోట్ల బిల్లులు ఉన్నాయని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. అయితే దుర్గామాత ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును 2023 నుంచి విద్యుత్ శాఖకు ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ జీరో అవుతుందని, బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీపై CMO సీరియస్ అయింది.
News December 28, 2025
బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

బంగ్లాదేశ్లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.


