News March 4, 2025

కొత్తగూడెం: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

B-2 బాంబర్: ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

image

ప్రపంచ గగనతల చరిత్రలో ఒక అద్భుతం B-2 Spirit Stealth Bomber. రాడార్లకే దొరకని దీని ‘స్టెల్త్’ టెక్నాలజీ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సుమారు 20 టన్నుల అణు లేదా సంప్రదాయ ఆయుధాలను మోస్తూ 50,000 అడుగుల ఎత్తు నుంచి మృత్యువులా విరుచుకుపడుతుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 9,600km ప్రయాణించి ప్రపంచంలో ఏ మూలనైనా నిశ్శబ్దంగా ధ్వంసం చేయగలదు. అమెరికా గగనతల ఆధిపత్యానికి ఇదే కీలకం.

News March 2, 2026

కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

image

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

News March 2, 2026

చిత్తూరు: టీచర్లకు గమనిక

image

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.