News March 14, 2025

కొత్తగూడెం: వ్యవసాయ కూలీకి రూ.22 లక్షల టాక్స్

image

కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లుకు అక్షరాల రూ.22,861,04 జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. నిరక్షరాస్యుడైన బాధితుడు విషయం తెలుసుకొని ఆందోళన చెందుతున్నాడు. పాన్‌కార్డు కూడా లేని తనకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారని నోటీసు వచ్చిందని, న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Similar News

News March 14, 2025

NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.

News March 14, 2025

స్టార్ క్రికెటర్ కూతురు మృతి

image

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్‌గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.

News March 14, 2025

SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

image

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్‌ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

error: Content is protected !!