News July 10, 2024
కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగ దరఖాస్తులు తిరస్కరణ?

సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్లైన్ విధానంలో ఈనెల 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎడ్సెల్ సంస్థకు అప్పగించారు. కాగా, సుమారు 21 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 4వేలకు పైగా దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ విషయం హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 2, 2026
తల్లాడ: ఈ స్టూడెంట్ బ్రిలియంట్

రంగం బంజరకు చెందిన ధర్మసోత్ మోక్షిత్ నాయక్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్లో నాలుగు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి నేషనల్ టాపర్గా నిలిచాడు. 50 మార్కులకు గాను 47 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గిరిజన విద్యార్థి సాధించిన ఈ ఘనతపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మోక్షిత్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
News March 1, 2026
షేర్ మార్కెట్ పేరుతో నిలువు దోపిడీ.. కేటుగాడికి రిమాండ్

ఖమ్మం: ఆన్లైన్ ఉద్యోగాలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్లో అధిక లాభాల ఆశచూపి రూ.47 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి రిమాండ్ విధించి జైలుకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
News March 1, 2026
ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


