News September 20, 2025
కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగులకు దసరా అడ్వాన్స్

సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 ఖాతాలో జయ చేయనున్నారు. ఈనెల 23న బ్యాంకు జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా అడ్వాన్స్ను పది వాయిదాలలో తిరిగి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
రాష్ట్రంలో 9 పార్టీల తొలగింపు.. ఏవంటే?

TG: దేశవ్యాప్తంగా రెండో దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం <<17762955>>తొలగించిన<<>> విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్సత్తా, ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ, బీసీ భారత దేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, TG ప్రగతి సమితి, TG ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు.
News September 20, 2025
మహిళా ఈ-హాత్ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చు.
News September 20, 2025
HYD: అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో CP CV ఆనంద్

HYD CP CV ఆనంద్ అడిషనల్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. తన కోర్టులో 11 రౌడీ గ్యాంగ్ కేసులు విన్నారు. వాటిలో 8 మందికి పీస్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయించారు. పెద్దలు, స్నేహితులతో పరస్పర ప్రతీకారంతో కాకుండా, ఒకరిని మరొకరు హత్య చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం పెంపొందించేందుకు ఈ బాండ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.