News May 4, 2024
కొత్తగూడ: వడదెబ్బతో మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్కు చెందిన ఆవుల కనకయ్య(59) వడదెబ్బతో మృతి చెందాడు.3రోజులుగా ఎండ తీవ్రతతో కనకయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 22, 2025
వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.
News April 22, 2025
WGL: ఇంటర్ ఫలితాలు.. జిల్లాల వారీగా ర్యాంకులు

* ఫస్ట్ ఇయర్
* హన్మకొండ-69.60 శాతంతో 5వ RANK
* ములుగు-64.36 శాతంతో 8వ RANK
* భూపాలపల్లి-59.18 శాతంతో 15వ RANK
*వరంగల్-57.93 శాతంతో 18వ RANK
*జనగామ-53.78 శాతంతో 26వ RANK
*మహబూబాబాద్-48.43 శాతంతో 33వ RANK
*సెకండియర్లో ర్యాంకులు
* ములుగు-81.06 శాతంతో 1వ RANK
* BHPL-73.73 శాతంతో 6వ RANK
* HNK-73.60 శాతంతో 7వ RANK
*WGL-68.67 శాతంతో 18వ RANK
*జనగామ-64.61 శాతంతో 27వ RANK
*MHBD-63.68 శాతంతో 29వ RANK
News April 22, 2025
INTER RESULTS.. వరంగల్లో ఎంత మంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 5,401 మంది పరీక్షలు రాయగా 3,709 మంది ఉత్తీర్ణత సాధించారు. 68.67 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 5,814 మందిలో 3,368 మంది ఉత్తీర్ణులు కాగా.. 57.93 పాస్ పర్సంటేజీ నమోదైంది.