News October 12, 2025

కొత్తగూడ: వెంటనే స్పందించిన ఎస్సై

image

కొత్తగూడ మండలం ఎంచగూడెంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకొని స్థానిక SI రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులు బావిలో పడిపోయారని తెలుసుకొని వారి ఆచూకీ కోసం మానవత్వంతో స్పందించి వెను వెంటనే గ్రామస్థుల సహకారంతో మృత దేహలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మండల ప్రజలు SIని అభినందిస్తున్నారు.

Similar News

News October 12, 2025

దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

image

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 12, 2025

‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

image

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్‌’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.

News October 12, 2025

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

image

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.