News April 4, 2024
కొత్తపట్నం: కరెంట్ షాక్తో యువకుడి మృతి

కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన ఆర్.సంజీవ వర్మ (32) పల్లెపాలెంలోని ‘మీరాకి ‘ జంతు సంరక్షణ సంస్థలో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. స్నానానికి వెళ్లి స్విచ్ వేయగా, కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 12, 2026
ప్రకాశం: శివాలయాల వద్ద బందోబస్తు

కనిగిరి మండలంలోని అన్ని శివాలయాల వద్ద మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని నందన మారెళ్ల కొండపై ఉన్న శివాలయాన్ని ఆయన సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్, రద్దీ నియంత్రణపై ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
News February 12, 2026
ప్రకాశం: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.
News February 12, 2026
ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.


