News July 9, 2025
కొత్తపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గోండుగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి అను ఉరివేసుకొని మంగళవారం మృతి చెందింది. మోతుగూడెం ఎస్సై కథనం మేరకు.. కొత్తపల్లి పంచాయతీ గొందిగూడెం గ్రామానికి చెందిన MLT విద్యార్థిని రోజు మాదిరిగానే రంపచోడవరం కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం వారి పొలానికి వెళ్లి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News July 9, 2025
‘శబరి’ రైలు ఇక సూపర్ఫాస్ట్

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ప్రెస్ను సూపర్ఫాస్ట్గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.
News July 9, 2025
HCA 2డే లీగ్.. పాలమూరు ఘన విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి B-డివిజన్ టుడే లీగ్ ఛాంపియన్షిప్లో ఉమ్మడి MBNR జట్టు రాకేశ్-XI జట్టుపై 148 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన MBNR జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాకేశ్-XI జట్టు 45.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో MDCA ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు.
News July 9, 2025
గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.