News April 8, 2025

కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

image

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.

Similar News

News February 9, 2026

కోహ్లీVsగంభీర్ ప్రచారంపై BCCI సెక్రటరీ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ-కోచ్ గంభీర్ మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి సైకియా ఖండించారు. వారిద్దరికి ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. వారిద్దరి మధ్య మంచి సంబంధం ఉందని చెప్పారు. టెస్టులకు రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని ఎవరూ బలవంతం చేయలేదని తెలిపారు. ఆయనొక లెజెండ్ అని, సొంత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆటగాళ్ల కెరీర్‌ విషయంలోనూ BCCI జోక్యం చేసుకోదని సైకియా తెలిపారు.

News February 9, 2026

ఆచమనం: పాటించాల్సిన నియమాలు!

image

ఆచమనం అంటే తినేముందు నీటిని సేవించడం. ఇది మనస్సును, శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఎడమచేతితో ఉద్ధరణెతో నీటిని తీసుకోవాలి. కుడిచేతి అరచేతిని ‘గోకర్ణాకృతి’లో ఉంచి చప్పుడు కాకుండా జలాన్ని స్వీకరించాలి. ఈ సమయంలో జలం మీసాలకు, గడ్డానికి తగలకూడదు. కేశవ, నారాయణ, మాధవ నామాలతో చేసే ఈ ప్రక్రియ చేయాలి. తద్వారా పంచేంద్రియాలు శుద్ధి చెందుతాయి. ఆచమనంతో ఏకాగ్రత, సాత్విక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

News February 9, 2026

ఊట్కూర్: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో ప్రశాంత్‌కు కాంస్య పతకం

image

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ రెజ్లింగ్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-15 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ కాంస్య పతకం సాధించాడు. ఈ విషయాన్ని పీడీ సాయినాథ్ తెలిపారు. ప్రశాంత్ సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు అభినందనలు తెలిపారు.