News February 12, 2025
కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్
ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.
Similar News
News February 12, 2025
MBNR: ఇద్దరు ఎస్ఐల బదిలీ: డీఐజీ
జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 12, 2025
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించండి.. డీకే అరుణ విజ్ఞప్తి
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికంగా నిర్వహించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ విషయమై బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఇతర ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News February 12, 2025
బాదేపల్లి మార్కెట్లో నేటి ధరలు
జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.