News December 21, 2025
కొత్త ఛార్జీలు ప్రకటించిన రైల్వే

రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215KM కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో KMకు ఒక పైసా చొప్పున పెంచింది. మరోవైపు మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు KMకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈనెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్లలో 500 KM జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ.10 అదనంగా ఖర్చు కానుంది.
Similar News
News December 25, 2025
NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 25, 2025
తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.
News December 25, 2025
విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


