News January 19, 2026
కొత్త ట్రెండ్.. పదేళ్లలో ANY CHANGE?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2016 Vs 2026’ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పదేళ్ల కాలంలో తమ రూపం ఎంతలా మారిందో చూపేలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ పాత, కొత్త ఫొటోలతో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా, అనన్య, సోనమ్ కపూర్ సైతం వారి ఓల్డ్ ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్గా మారాయి. ఈ ట్రెండ్ను మీరూ ట్రై చేశారా?
Similar News
News February 2, 2026
అంబేడ్కర్ వర్సిటీ పరీక్షలు వాయిదా.. 17 నుంచి కొత్త షెడ్యూల్!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. హాల్టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
News February 2, 2026
జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. రమేశ్పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే భద్రత కల్పించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా జోగి రమేశ్ ఇంటిపై <<19023109>>దాడి ఘటనలో<<>> పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశారు.
News February 2, 2026
నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.


