News December 18, 2025

కొత్త మెడికల్ కాలేజీల్లో 96కి పెరిగిన పీజీ సీట్లు

image

AP: కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా 36 PG సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం నియామకాలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించగా ప్రిన్సిపాళ్లు MNCకి దరఖాస్తు చేశారు. మంత్రి సత్యకుమార్ సంప్రదింపులతో తాజా సీట్లు శాంక్షన్ అయ్యాయి. ఏలూరుకు 12, రాజమండ్రికి 4, నంద్యాలకు 4, విజయనగరానికి 8, మచిలీపట్నానికి 8 కేటాయించారు. గతంలో 60 సీట్లు రాగా ఇప్పుడవి 96కు చేరాయి.

Similar News

News December 22, 2025

యూరియాను కౌలు రైతులు ఎలా బుక్ చేయాలి?

image

TG: కౌలు రైతులు యూరియా పొందాలంటే Fertilizer Booking App డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్ ఆప్షన్‌లో ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, యాప్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. తర్వాత యాప్‌లో కనిపించే వివరాలను నింపాలి. బుకింగ్ కోడ్ రాగానే కేటాయించిన సమయంలో డీలర్‌ వద్దకు వెళ్లి బుకింగ్‌ ఐడీ చూపించి, డబ్బు చెల్లిస్తే రైతుకు యూరియా ఇస్తారు.

News December 22, 2025

APPLY NOW: NTPCలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

image

<>NTPC<<>>లో 15 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (DEC 24)ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/ బీటెక్( ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News December 22, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,000 ఎగబాకి రూ.1,24,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే రూ.10వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.