News February 1, 2026
కొత్త స్కామ్: రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..

సైబర్ కేటుగాళ్లు మరో కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. మీ దగ్గర రూ.5 నోటు చాలా అరుదని, ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ చేసి నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం ముందుగా కొంత డబ్బు పంపాలని సూచిస్తున్నారు. ఇది నమ్మి వారికి డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో పాటుAPK ఫైళ్లు పంపి డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News February 21, 2026
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.
News February 21, 2026
తిరుమల క్షేత్రంలో విశిష్ట సేవ ‘అర్చన’

అర్చన అంటే స్వామివారి 1008 దివ్య నామాలను పఠిస్తూ, లోకకళ్యాణం కోసం ఆశీస్సులు కోరడం. ఈ సేవలో పాల్గొనే గృహస్థుల పేరు, గోత్రాలతో సంకల్పం చెబుతారు. ఇది కేవలం తిరుమల క్షేత్రానికే పరిమితమైన విశిష్ట సేవ. దీనికి సంబంధించి 1518 నాటి శాసనం కూడా ఉంది. రోజూ ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. ఇందులో మనం కూడా పాల్గొనవచ్చు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది.


