News October 15, 2025

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

Similar News

News October 15, 2025

డయల్ 100పై వేగంగా స్పందించాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కొత్తగా ఏర్పాటు చేసిన రికార్డు రూమును ప్రారంభించారు. ఆవరణ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించి, గ్రేవ్ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డయల్ 100 కాల్స్‌పై వేగంగా స్పందించాలని, గస్తీ పెంచాలని సీఐ రామన్‌కు సూచించారు.

News October 15, 2025

TU: ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవి

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవిని నియస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొ.టి.యాదగిరి రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి అందజేశారు. మహ్మద్ అబ్దుల్ ఖవి మైనారిటీ సెల్ డైరెక్టర్, ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఉర్దూ అరబిక్ తదితర పోస్టుల్లో తనదైన ముద్ర వేశారు.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>