News January 23, 2026
కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News February 6, 2026
పచ్చిపేడను ఎలా మగ్గబెడితే మంచిది?

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
News February 6, 2026
శ్రీకాకుళం: జాబ్ మేళాలో 327 మంది ఎంపిక

శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు 358 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయగా, 327 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో టాటా ఎలక్ట్రానిక్స్కు 151, హ్యుందాయ్ మోబిస్కు 49, ఇసుజు మోటార్స్కు 40, డెక్కన్ కెమికల్స్కు 58, అపోలో టైర్స్కు 17, ఇండోమిన్కు 12 మంది ఉన్నారని ప్రిన్సిపల్ తెలిపారు.
News February 6, 2026
కాలతన్నితే పెరిగేది పుచ్చకాయ, కుళ్లేది గుమ్మడికాయ

పుచ్చ పంటను సాగు చేసేటప్పుడు కాయ తీగను కాలితో తంతే అది మరింత బలంగా వ్యాపిస్తుందని ఒక నమ్మకం. అదే గుమ్మడికాయకు చిన్న దెబ్బ తగిలినా లోపల కుళ్లి పోతుందట. నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు కష్టాలు, విమర్శలు ఎదురైనా వాటిని సానుకూలంగా మార్చుకొని పుచ్చకాయలా మరింత ఉత్సాహంతో ఎదుగుతారు. మరి కొందరు వ్యక్తులు చిన్నపాటి కష్టాలకే గుమ్మడికాయలా కుంగిపోయి, ధైర్యం కోల్పోతారని ఈ సామెత చెబుతుంది.


