News January 23, 2026
కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News January 25, 2026
తిరుమలలో మొదలైన హనుమంతుని వాహనసేవ

రథసప్తమి వాహన సేవల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి హనుమంత వాహన సేవ ప్రారంభమైంది. భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై మాడ వీధులలో ఊరేగనున్నాడు. గోవింద నామ స్మరణలతో మాఢ వీధులు మారుమోగుతున్నాయి.
News January 25, 2026
సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.
News January 25, 2026
అవార్డు అందుకున్న విజయనగరం కలెక్టర్

బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉత్తమ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, నూతన విధానాల అమలు వంటి అంశాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని అధికారులు ప్రశంసించారు.


