News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
Similar News
News March 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News March 16, 2025
మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారి ఇచ్చిన కొడుకు

తండ్రిపై దాడి చేయించేందుకు సుఫారి ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.
News March 16, 2025
ASF: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో 6వ, 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్వేత తెలిపారు. విద్యార్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.