News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
Similar News
News March 16, 2025
విడుదలైన వారానికే OTTలోకి థ్రిల్లర్ మూవీ

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 20 నుంచి తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోపే ఓటీటీ విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.
News March 16, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓VKB:ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట:జాన్ వెస్లీ.✓VKB: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 117 మంది గైర్హాజరు.✓VKB:అభివృద్ధికి సహకరిస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్ ప్రతిక్ జైన్.✓TDR:త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళల నిరసన.✓VKB:ఈనెల 26న వాహనాల బహిరంగ వేలం పాట:ఎస్పి.✓ కుల్కచర్ల:పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ.✓ జిల్లాలో ఘనంగా కాన్సిరాం జయంతి కార్యక్రమాలు.
News March 16, 2025
ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

AP: భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘భారతదేశం’. ఇది జగన్మాత ఆదేశం’ అని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.