News February 9, 2025

కొమురవెల్లిలో బందోబస్తును పరిశీలించిన ఏసీపీ

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నాల్గవ ఆదివారం సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు.

Similar News

News February 17, 2026

KMR: కలిసొచ్చిన మూడు ఓట్లు.. చైర్ పర్సన్‌కు మలుపు

image

కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నిక మూడు రోజులపాటు మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు మూడు ఓట్ల తేడాతో 38వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైనే విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్ రెబల్) మళ్లీ కాంగ్రెస్‌లో చేరి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె BRS మద్దతుతో పుర పీఠం ఎక్కడం గమనార్హం.

News February 17, 2026

ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

image

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.

News February 17, 2026

ములుగు: బంపర్ ఆఫర్.. రెడీగా రూ.55 కోట్ల ఫండ్!

image

సాధారణంగా కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతాయి. కానీ, ములుగు మున్సిపల్ కార్యవర్గానికి సమస్యలతో పాటు నిధులు వెల్ కమ్ చెబుతున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మేజర్ పంచాయతీ హోదాలో మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొత్తం రూ.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక సమస్యలున్నాయి. వీటిని తీర్చుతూనే ముందుగా కోతుల సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.