News January 31, 2025

కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10

image

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>

News September 19, 2025

అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర@ రూ.8

image

అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ఎగుమతికి ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ధర కిలో రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసే ట్రేడర్లపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951ను అందుబాటులో ఉంచారు.

News September 19, 2025

బాపట్ల: 18-30 ఏళ్లు ఉన్న వారికే ఈ ఛాన్స్

image

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాపట్లలో శనివారం జాబ్ మేళాను స్థానిక సాల్వేషన్ ఆర్మీ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి తెలిపారు. అరబిందో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు హాజరుకానున్నాయన్నారు. 18-30 ఏళ్లు కలిగి పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, ఏంబీఏ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.