News January 31, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
కాసేపట్లో వర్షం: HYD వాతావరణ కేంద్రం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, HYD, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News July 6, 2025
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.
News July 6, 2025
NGKL: జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన- కలెక్టర్

నాగర్కర్నూల్ జిల్లాలో రేపు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30కు మన్ననూర్ గృహవాని గెస్ట్ హౌస్కు చేరుకొని అక్కడే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అమ్రాబాద్ పీడబ్ల్యూ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.