News March 26, 2024
కొమురవెల్లి మల్లన్న పదో వారం ఆదాయం రూ.43.76 లక్షలు

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పదో వారం పురస్కరించుకుని రూ.43.76 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ ప్రకటించారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదాల విక్రయాల ద్వారా శనివారం రూ.4,77,648, ఆదివారం రూ.34,98,777, సోమవారం రూ.4,00,020 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు.
Similar News
News April 9, 2026
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 8, 2026
మెదక్: పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్లు కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని తద్వారా ముందుకు పోవాలన్నారు.
News April 8, 2026
మెదక్: పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్లు కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని తద్వారా ముందుకు పోవాలన్నారు.


