News January 23, 2025
కొమురవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

DCM, బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయలైన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైక్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 27, 2026
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్చిట్

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. దీంతో కవితకు క్లీన్చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత 166 రోజులు జైలు జీవితం గడిపారు. మరోవైపు ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కూడా క్లీన్చిట్ లభించింది.
News February 27, 2026
నేటి నుంచి వీరవల్లి శ్రీ తిరుపతమ్మ, గోపయ్య తిరుణాళ్లు

బాపులపాడు మండలం వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ , గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కళ్యాణం చేయనున్నారు. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. చివరి రోజు భక్తులకు అన్నసంతర్పణ చేయనున్నారు.
News February 27, 2026
కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో <<19251338>>క్లీన్చిట్<<>> లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న సందర్భంగా భార్య, కూతురి ఆనందం అవధులు దాటింది.


