News March 20, 2024
కొమ్మాది: కళాశాలలో అమెరికా రాయబారి సందడి

అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, ఆ దేశ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం వసతిగృహ విద్యార్థినులతో సందడి చేశారు. సంచయిత గజపతిరాజు ఆధ్వర్యంలో పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత బయో టాయ్లెట్లను ప్రారంభించారు. అంతకు ముందు గిరిజన విద్యార్థినులంతా థింసా నృత్యంతో స్వాగతం పలికారు.
Similar News
News September 5, 2025
కబడ్డీకి విశాఖలో ఆదరణ అద్భుతం: ఎంపీ

విశాఖ వేదికగా జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్కు ఆదరణ అద్భుతంగా ఉందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. గురువారం జరిగిన తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ను ఆయన వీక్షించారు. విశాఖ ప్రజలు కబడ్డీని అద్భుతంగా ఆదరిస్తున్నారని, ఈ ప్రో లీగ్ ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఉన్నారు.
News September 5, 2025
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖలో శుక్రవారం జరగనున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 7.30గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో బయలదేరనున్నారు. అనంతరం రాడిసన్ బ్లూ హోటల్లో ఉదయం 10 గంటలకు జరిగే ACIAM ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హాజరవుతారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ADR)పై సీఎం ప్రసంగించనున్నారు.
News September 5, 2025
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కు సర్వం సిద్ధం

విశాఖ బీచ్ రోడ్డులోని ఎంజీఎం మైదానంలో ఈరోజు నుంచి 7వ తేదీ వరకు జరిగే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరుగుతాయని, ప్రవేశం ఉచితం అని వెల్లడించారు. పర్యాటకశాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.