News September 13, 2025

కొయ్యలగూడెం: వర్జినియా పొగాకు రికార్డు ధర

image

వర్జినియా పొగాకు ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో శనివారం జరిగిన కొనుగోళ్లలో కేజీ రూ.430కి చేరింది. దాదాపు 60 సంవత్సరాల వర్జినియా చరిత్రలో ఇదే అత్యధిక ధర అని తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలో రూ.35 పెరగడం నమ్మలేని విషయమని రైతాంగం చెబుతోంది. కొనుగోళ్లు ప్రక్రియ ముగుస్తున్న సమయాల్లో ధర పెరుగుదల సాధారణమే అయినప్పటికీ ఇంత వేగంగా పెరగడం అరుదని వారు అంటున్నారు.

Similar News

News September 13, 2025

ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

image

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

News September 13, 2025

ASIA CUP: నిప్పులు చెరిగిన లంక బౌలర్లు

image

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. నువాన్ తుషారా, దుష్మంత చమీర నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఖాతా తెరవకుండానే బంగ్లా తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్(0), పర్వేజ్ ఎమోన్(0) డకౌట్లుగా వెనుదిరిగారు. హృదోయ్ (8) రనౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 5 ఓవర్లలో 16/3గా ఉంది.

News September 13, 2025

ఆ ఊరి నిండా IAS, IPSలే!

image

UPలోని మాధోపట్టి గ్రామం UPSC ఫ్యాక్టరీ, IAS విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామం 50 మందికిపైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. వారంతా IAS, IPS, IRS, IFS ఆఫీసర్లుగా సేవలందిస్తున్నారు. 1914లో ముస్తఫా ఈ గ్రామం నుంచి మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే కుటుంబంలో నలుగురు సోదరులు సివిల్స్‌కు ఎంపిక కావడంతో ఆ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఈ ఊరికి వచ్చిన కోడళ్లు కూడా IAS, IPS సాధించారు.