News September 28, 2024

కొయ్యూరు: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థి

image

కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జే.మహిత్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ శనివారం తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. అయితే షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలకు మహిత్ ఎంపికయ్యారని అభినందించారు.

Similar News

News December 31, 2025

విశాఖ: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.