News August 24, 2025
కొరిశపాడులో దొంగతనం.. రూ.1.85కోట్ల ల్యాప్ట్యాప్ల చోరీ

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ కంటైనర్ హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తోంది. ఈ క్రమంలో కంటైనర్ నుంచి సుమారు 250 ల్యాప్టాప్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించారు. వీటి విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని చీరాల డీఎస్పీ మొయిన్ వివరాలు వెల్లడించారు.
Similar News
News August 25, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, KMM, ఉమ్మడి ADB, వరంగల్, KNR, నల్గొండ, MBNRలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 25, 2025
HYD: ఆగస్టు 31న అనంతగిరి హిల్స్ బర్డ్ వాక్..!

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది పక్షుల ప్రేమికులు పాల్గొన్నారు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. తదుపరి బర్డ్ వాక్ ఆగస్టు 31న అనంతగిరి హిల్స్లో జరగనుంది.
News August 25, 2025
ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్ ఇస్తారు.