News December 31, 2024
కొరిశపాడు: రోడ్డు మిల్లర్ ఢీకొని బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735574319219_51915995-normal-WIFI.webp)
ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడులో సోమవారం విషాద ఘటన జరిగింది. స్థానిక జగజ్జీవన్ రావ్ కాలనీకి చెందిన దుడ్డు నాగయ్య కుమారుడు గౌతమ్ తన తాతతో కలిసి బైకుపై సెంటర్లో ఉన్న బొడ్డురాయి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు బైక్పై కూర్చొని ఉండగా రోడ్లు వేస్తున్న మిల్లర్ రివర్స్లో వచ్చి బైకును ఢీకొట్టింది. బాలుడికి బలమైన దెబ్బ తగలడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News February 5, 2025
ప్రకాశం: వరల్డ్ కప్ విజేతకు ఘన స్వాగతం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738722826073_60469853-normal-WIFI.webp)
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738677315258_18483461-normal-WIFI.webp)
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.
News February 4, 2025
ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738636483507_17642736-normal-WIFI.webp)
ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.