News March 28, 2025
కొలికపూడి వివాదాలపై సమగ్ర నివేదిక కోరిన అధిష్ఠానం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలపై ఆ పార్టీ అధిష్ఠానం సమగ్ర నివేదిక కోరింది. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేకి మధ్య ఆది నుంచి నెలకొన్న వివాదాల కారణంగా పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందని గ్రహించిన అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం 3 మెన్ కమిటీ హై కమాండ్ నియమించింది. గత 10నెలలుగా ఎమ్మెల్యే కేంద్రంగా జరిగిన వివాదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీచేశారు.
Similar News
News March 31, 2025
తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.
News March 31, 2025
ORRపై టోల్ ఛార్జీల పెంపు

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.
News March 31, 2025
పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు.